న్యూఢిల్లీ: ఐపీఎల్ కొత్త ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్ఎస్జీ) తన లోగోను విడుదల చేసింది. ఫ్రాంచైజీ యజమాని సంజీవ్ గోయెంక సోమవారం జట్టు లోగోను అధికారికంగా విడుదల చేశారు. జాతీయ జెండాలోని రంగులతో గరుడ పక్షి ఆకారం లోగో రూపొందించారు. మధ్యలో.. బంతి బ్యాట్తో ఆకర్షణీయంగా ఉంది. ‘గరుడ పక్షి భారతీయ సంస్కృతిలో భాగం’అని ఈ సందర్భంగా ఎల్ఎస్జీ తెలిపింది. అంతకుముందు జట్టు పేరును అభిమానుల నుంచి తీసుకుని ప్రకటించిన విషయం తెలిసిందే.