ముంబై : ఆర్సీబీ వరుసగా రెండోసారి విజేతగా నిలిచిన ఐపీఎల్19వ సీజన్ వ్యూయర్షిప్లో సరికొత్త రికార్డులను తిరగరాసింది. ఈ సీజన్ మొత్తంమీద రికార్డుస్థాయిలో 1.2 బిలియన్ల (120 కోట్ల) వ్యూయర్షిప్ నమోదైనట్లు అధికారిక బ్రాడ్కాస్టర్ జియోస్టార్ తెలిపింది. ఇది గత ఏడాది కంటే 7 శాతం ఎక్కువ కాగా మొత్తం వాచ్ టైమ్ 870 బిలియన్ నిమిషాలను తాకింది.
ఇక, గుజరాత్-ఆర్సీబీ ఫైనల్ మ్యాచ్ను డిజిటల్, టీవీ స్క్రీన్లపై రికార్డు స్థాయిలో 40 కోట్ల (400 మిలియన్ల) కంటే ఎక్కువ మంది వీక్షించారు. దాంతో ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక మంది చూసిన మ్యాచ్గా రికార్డుకెక్కింది.