IPL 2023 : ముంబైలోని వాంఖెడే స్టేడియంలో పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు దంచి కొట్టారు. దాంతో, పంజాబ్ 214 పరుగులు చేసింది. కెప్టెన్ సామ్ కరన్(55, 29 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు. హర్ప్రీత్ సింగ్ భాటియా(41) చెలరేగి ఆడాడు. బెహ్రాన్డార్ఫ్ వేసిన 20వ ఓవర్లో జితేశ్ శర్మ(25) సిక్స్ కొట్టాడు. దాంతో పంజాబ్ స్కోర్ 200 దాటింది. నాలుగో బంతికి భారీ షాట్ ఆడబోయి జితేశ్ బౌల్డయ్యాడు. ఆ తర్వాత వచ్చిన హర్ప్రీత్ బ్రార్ ఫోర్ కొట్టాడు. దాంతో, పంజాబ్ 8 వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది.
It’s raining sixes in Mumbai 🌧️
Half-century comes up for @PunjabKingsIPL skipper @CurranSM 👏👏#PBKS nearing the 200-run mark now!
Follow the match ▶️ https://t.co/FfkwVPpj3s #TATAIPL | #MIvPBKS pic.twitter.com/8ma8iLaP9v
— IndianPremierLeague (@IPL) April 22, 2023
టాస్ ఓడిపోయి బ్యాటింగ్కు దిగిన పంజాబ్కు మూడో ఓవర్లో షాక్ తగిలింది. ఫామ్లో ఉన్న మాథ్యూ షార్ట్(11) ఔటయ్యాడు. ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ సింగ్ (26), అథర్వ తైడే ఇన్నింగ్స్ నిర్మించారు. దాంతో, పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 58 పరుగులు చేసింది. అయితే.. అర్జున్ టెండూల్కర్ ఎల్బీగా ఔట్ చేసి45 పరుగుల భాగస్వామ్యానికి తెర దించాడు. పీయూష్ చావ్లా వేసిన 10వ ఓవర్లో లివింగ్స్టోన్(10) స్టంపౌట్, అథర్వ తైడే(29) బౌల్డ్ అయ్యారు. అయితే.. ఐదో వికెట్కు సామ్ కరన్(55), హర్ప్రీత్ సింగ్ భాటియా(41) కీలకమైన 92 రన్స్ జోడించారు. ఆ తర్వాత వచ్చిన జితేశ్ శర్మ (25) దంచాడు. ముంబై బౌలర్లలో పీయూష్ చావ్లా, కామెరూన్ గ్రీన్ రెండు వికెట్లు తీశారు. అర్జున్ టెండూల్కర్, బెహ్రాన్డార్ఫ్, జోఫ్రా ఆర్చర్కు ఒక్కో వికెట్ దక్కింది.