ఐపీఎల్ సీజన్-16లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), కోల్కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య బుధవారం జరిగిన మ్యాచ్లో కోల్కతా జట్టు 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. 201 పరుగుల భారీ టార్గెట్ కోసం బరిలోకి దిగిన బెంగళూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 179 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ ఓటమితో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుస విజయాలకు తెరపడింది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరిగింది.
బెంగళూరు ఆటగాళ్లలో కెప్టెన్ విరాట్ కోహ్లి 54(37 బంతుల్లో 6 ఫోర్లు) అర్ధశతకంతో రాణించగా,
మహిపాల్ లోమ్రర్ 34(18 బంతుల్లో 1×4, 3×6) ఫర్వాలేదనిపించాడు కానీ మిగిలిన వారు విఫలం అయ్యారు.
కోల్కతా బౌలర్లలో వరుణ్ చక్రవర్తి మూడు వికెట్లు తీయగా, సుయాష్ శర్మ, రస్సెల్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు.
అంతకు ముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా జట్టులో ఆటగాళ్లు రెచ్చిపోయి ఆడారు. ముఖ్యంగా ఓపెనర్ జేసన్ రాయ్ 56( 29 బంతుల్లో 4×4, 5×6) ధాటిగా బ్యాటింగ్ చేసి మంచి ఓపెనింగ్ చేశాడు. ఈ ఇన్నింగ్స్తో రాయ్ వరుసగా రెండో హాఫ్ సెంచరీ సాధించాడు. రాయ్ ఇచ్చిన శుభారంభాన్నికి తోడుగా కెప్టెన్ నితీశ్ రాణా48( 21 బంతుల్లో 3×4, 4×6) కూడా సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. వెంకటేశ్ అయ్యర్ 31(26 బంతుల్లో 3×4) మంచి ఇన్నింగ్స్తో అలరించాడు. నిర్ణీత 20 ఓవర్లలో కోల్కతా నైట్ రైడర్స్ 5 వికెట్లు కోల్పోయి 200 పరుగులు సాధించింది.
బెంగుళూరు బౌలర్లలో వైశాక్, హసరంగ చెరో 2 వికెట్లు పడగొట్టారు.