ఐపీఎల్ సీజన్-16లో భాగంగా బుధవారం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), కోల్కతా నైట్ రైడర్స్ (KKR) జట్లు తలపడ్డాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ జరుగుతున్నది. ఈ సీజన్లో ఇది 36వ మ్యాచ్. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన కోల్కతా జట్టులో ఆటగాళ్లు రెచ్చిపోయి ఆడారు.
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోహ్లీ టీమ్కు 201 పరుగుల భారీ టార్గెట్ ఇచ్చారు. ముఖ్యంగా ఓపెనర్ జేసన్ రాయ్ 56( 29 బంతుల్లో 4×4, 5×6) ధాటిగా బ్యాటింగ్ చేసి మంచి ఓపెనింగ్ చేశాడు. ఈ ఇన్నింగ్స్తో రాయ్ వరుసగా రెండో హాఫ్ సెంచరీ సాధించాడు. రాయ్ ఇచ్చిన శుభారంభాన్నికి తోడుగా కెప్టెన్ నితీశ్ రాణా48( 21 బంతుల్లో 3×4, 4×6) కూడా సమయోచితంగా బ్యాటింగ్ చేశాడు. వెంకటేశ్ అయ్యర్ 31(26 బంతుల్లో 3×4) మంచి ఇన్నింగ్స్తో అలరించాడు. నిర్ణీత 20 ఓవర్లలో కోల్కతా నైట్ రైడర్స్ 5 వికెట్లు కోల్పోయి 200 పరుగులు సాధించింది
బెంగుళూరు బౌలర్లలో వైశాక్, హసరంగ చెరో 2 వికెట్లు పడగొట్టారు.
ఈ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఇప్పటివరకు ఏడు మ్యాచ్లు ఆడి మూడింట ఓడి నాలుగు విజయాలు సాధించింది. ఎనిమిది మ్యాచ్ పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో నిలిచింది. మరోవైపు కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కూడా ఏడు మ్యాచ్లు ఆడి ఐదు మ్యాచ్లు ఓడిపోయింది. కేవలం రెండు విజయాలతో నాలుగు పాయింట్లు సాధించి ప్రస్తుతం ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. ఇరు జట్లు ఈ మ్యాచ్లో ఎలాగైనా గెలిచి తమ స్థానాలను మెరుగుపర్చుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాయి.