బెంగళూరు: ఐపీఎల్ సీజన్ 16లో భాగంగా మంగళవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), ముంబై ఇండియన్స్ (MI) జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ముంబై టీమ్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన RCB నిర్ణీత 20 ఓవర్లలో 199 పరుగులు రాబట్టగా.. 200 పరుగుల భారీ లక్ష్యంతో బరిలో దిగిన MI మరో 21 బంతులు మిగిలి ఉండగానే 16.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి ఘన విజయాన్ని అందుకుంది.
అయితే, ఈ మ్యాచ్ గురించిన కొన్ని జ్ఞాపకాలను ముంబై ఇండియన్స్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ మీడియాతో పంచుకున్నారు. ఆర్సీబీ బౌలర్లు స్లో బాల్స్తో ఊరించి బోల్తా కొట్టించే ప్రయత్నం చేశారని, అది పసిగట్టిన తాను.. ‘మనం బంతిని బలంగా బాదాలి లేదంటే గ్యాప్లలోకి పంపించాలి’ అని నేహల్ వధేరాతో చెప్పానని అన్నారు. స్లో బాల్స్ను బలంగా కొట్టకపోతే బౌండరీలకు బదులుగా క్యాచ్ అవుట్లు అయ్యే ప్రమాదం ఉందన్నారు. ‘నా పరుగులు ఎక్కడ ఉన్నాయో నాకు తెలుసు’ అని పేర్కొన్నారు.
ఈ మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ కేవలం 35 బంతుల్లో 83 పరుగులు చేశాడు. అందులో 7 ఫోర్లు, 6 సిక్స్లు ఉన్నాయి. నేహల్ వధేరా కూడా కేవలం 34 బంతుల్లో 52 పరుగులు చేశాడు.