బెంగళూరు : స్లో ఓవర్రేట్ కారణంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్కు జరిమానా విధించారు. సోమవారం నాటి మ్యాచ్లో విజయానంతరం లక్నో సూపర్ జెయింట్స్ జట్టు చివరి ఆటగాడు అవేశ్ఖాన్ హెల్మెట్ను నేలకేసి కొట్టడం నిబంధనలకు విరుద్ధమని మ్యాచ్ రెఫరీ అతడిని మందలించాడు.
ఈ సీజన్లో రాయల్ చాలెంజర్స్ చేసిన తొలి తప్పిదం కారణంగా కెప్టెన్ డుప్లెసిస్కు రూ.12 లక్షల జరిమానా విధించారు. లెవెల్-1 తప్పిదానికి పాల్పడిన అవేశ్ఖాన్పై ఎలాంటి జరిమానా విధించలేదని, కేవలం మందలించినట్టు ఒక ప్రకటనలో తెలిపారు.