IPL 2023 : ఐపీఎల్ 2023 వేలంలో ఇంగ్లండ్ యువ ఆల్రౌండర్ సామ్ కరన్ రికార్డు సృష్టించాడు. ఐపీఎల్ వేలంలో అత్యధిక ధర పలికిన ఆటగాడిగా గుర్తింపు సాధించాడు. టీ 20 వరల్డ్ కప్లో అదరగొట్టిన సామ్ కరన్ను పంజాబ్ కింగ్స్ రూ.18.50 కోట్లకు దక్కించుకుంది. వేలంలో అతను భారీ ధరకు అమ్ముడుపోవడం ఖాయమని మాజీలు అభిప్రాయపడ్డారు. ఊహించినట్టుగానే సామ్ కరన్ను కొనేందుకు ఫ్రాంఛైజీలు పోటీపడ్డాయి. చివరకు పంజాబ్ కింగ్స్ ఈ ఆల్రౌండర్ కోసం రూ. 18 కోట్ల భారీ ధర పెట్టింది.
టీ 20 వరల్డ్కప్లో సామ్ కరన్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. ఫైనల్లో 3 వికెట్లు తీసి పాకిస్థాన్ను దెబ్బకొట్టాడు. ఆరు మ్యాచుల్లో 13 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో అతను ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డు అందుకున్నాడు. దాంతో ఈసారి ఐపీఎల్ వేలంలో సామ్ కరన్ కొనేందుకు ఫ్రాంఛైజీలు పోటీ పడతాయని, అతను రూ. 16 కోట్ల నుంచి 17 కోట్ల వరకు ధర పలుకుతాడని మాజీ క్రికెటర్లు అన్నారు గత సీజన్లో సామ్ కరన్ చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు. ఈసారి వేలంలో అతడిని దక్కించుకునేందుకు ఆ జట్టు పోటీపడింది.
Record Alert 🚨
Sam Curran 𝙗𝙚𝙘𝙤𝙢𝙚𝙨 𝙩𝙝𝙚 𝙢𝙤𝙨𝙩 𝙚𝙭𝙥𝙚𝙣𝙨𝙞𝙫𝙚 𝙥𝙡𝙖𝙮𝙚𝙧 𝙚𝙫𝙚𝙧 𝙩𝙤 𝙗𝙚 𝙗𝙤𝙪𝙜𝙝𝙩 𝙞𝙣 𝙄𝙋𝙇!
He goes BIG 🤯- INR 18.50 Crore & will now play for Punjab Kings 👏 👏#TATAIPLAuction | @TataCompanies pic.twitter.com/VlKRCcwv05
— IndianPremierLeague (@IPL) December 23, 2022