IPL 2023 | ఐపీఎల్ 62వ మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ టైటాన్స్ జట్టు సన్ రైజర్స్ హైదరాబాద్పై 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో గుజరాత్ ప్లేఆఫ్కు అర్హత సాధించింది. ఈ సీజన్లో ప్లే ఆఫ్కు అర్హత సాధించిన తొలి జట్టుగా నిలిచింది. అయితే, ఈ మ్యాచ్ సందర్భంగా కీలక పరిణామం చోటు చేసుకున్నది. కెప్టెన్ హార్దిక్ పాండ్యాపై కోచ్ ఆశిష్ నెహ్రా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. జట్టు ఆట తీరుపై నెహ్రా ఆగ్రహం పలుమార్లు తీవ్ర అసంతృప్తికి గురయ్యాడు. 2022లో ఐపీఎల్ కోచ్ పదవి చేపట్టి నుంచి తొలిసారిగా ఆగ్రహానికి గురయ్యాడు. హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో టాస్ ఓడి గుజరాత్ తొలుత బ్యాటింగ్ చేసింది.
Ashish Nehra is highly angry that he is not listening to Hardik Pandya. This is Ashish Nehra for you.#GTvsSRH #SRHvsGT pic.twitter.com/X2zEZqzQrc
— Vikram Rajput (@iVikramRajput) May 15, 2023
తొలి ఓవర్లోనే వృద్ధిమాన్ సాహా ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత శుభ్మన్ గిల్ రెండో వికెట్కు సాయి సుదర్శన్తో కలిసి 147 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. 36 బంతుల్లో ఆరు ఫోర్లు, సిక్సర్ సాయంతో 47 పరుగులు చేసి సాయి సుదర్శన్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత గుజరాత్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోయింది. పాండ్యా (8), డేవిడ్ మిల్లర్ (7), రాహుల్ తెవాటియా (3) తక్కువ పరుగులకే వెనుదిరిగారు. ఒక దశలో వికెట్ నష్టానికి 147 పరుగులు సాధించిన గుజరాత్ జట్టు.. 175 పరుగులకు ఐదు వికెట్లు కోల్పోయింది. అనంతరం శుభ్మన్ గిల్ ఐపీఎల్ కెరీర్లో తొలి సెంచరీని సాధించాడు. సహచర జట్టు సభ్యులంతా గిల్ను చప్పట్లు కొడుతూ అభినందించగా.. కోచ్ నెహ్రా ముఖంలో మాత్రం ఎలాంటి సంతోషం కనిపించలేదు.
Ashish Nehra angry 🤬🤬
"Mujhe Rokne ka kisi mein dum nahi hai"#GTvsSRH #SRHvsGT pic.twitter.com/IHOLlBZvhO— Silly Context (@sillycontext) May 15, 2023
కనీసం చప్పట్లు కొట్టి అభినందించలేదు. ఆశివ్ నెహ్రా ప్రవర్తనను చూసి టీవీ వ్యాఖ్యలు ఆకాశ్ చోప్రా, సబా కరీమ్లు సైతం షాక్కు గురయ్యారు. నెహ్రా తన జట్టు నుంచి ఎక్కువగా కోరుకుంటున్నాడని, అందుకే సెంచరీని సెలబ్రేట్ చేసుకోవడం లేదని పేర్కొన్నారు. ఇక సెంచరీ సాధించిన జోష్లో ఉన్న గిల్ అవుట్ అయ్యాడు. 56 బంతుల్లో 13 ఫోర్లు, సిక్సర్ సహాయంతో 101 పరుగులు చేసి పెవిలియన్కు చేరాడు. గుజరాత్ 41 పరుగులకు ఎనిమిది వికెట్లు కోల్పోయింది. హైదరాబాద్ బౌలర్ భువనేశ్వర్ చివరి ఓవర్ (20వ ఓవర్)లో నాలుగు వికెట్ల పడగొట్టాడు.
Shubhman Gill hits his maiden IPL hundred❤️ 🙌🏾💪🏾 The future of Indian Cricket🇮🇳 pic.twitter.com/NVVFj3Kl1X
— Tim David Stan 💀 (@Aatmanirbharboi) May 15, 2023
గుజరాత్ బ్యాట్మెన్స్ చెత్తషాట్లు ఆడుతూ వికెట్లు కోల్పోవడంతో నెహ్రా కెప్టెన్పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. బౌండరీ లైన్ వద్ద హార్దిక్, నెహ్రా మధ్య వాగ్వాదం జరిగింది. నెహ్రా అక్కడి నుంచి వెళ్లిన తర్వాత గుజరాత్ టైటాన్స్ డైరెక్టర్ విక్రమ్ సోలంకి హార్దిక్ వద్దకు చేరుకొని శాంతింప చేసేందుకు ప్రయత్నించాడు. ఆ తర్వాత గుజరాత్ బౌలర్లు ధీటుగా రాణించడంతో హైదరాబాద్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. ఇప్పటి వరకు గుజరాత్ 13 మ్యాచులు ఆడగా.. తొమ్మిది విజయం సాధించి.. మరో నాలుగు మ్యాచుల్లో ఓటమి పాలైంది. పాయింట్ల పట్టికలో 18 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నది. గుజరాత్ జట్టు తన చివరి మ్యాచ్ను రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో తలపడనున్నది.