వచ్చే ఐపీఎల్ నుంచి మొత్తం పది జట్లు పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. రెండు కొత్త జట్లలో అహ్మదాబాద్ జట్టు ఒకటి. దీనికి టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా నాయకత్వం వహిస్తున్నాడు. కొత్తగా కెప్టెన్ అయిన హార్దిక్.. తన నాయకత్వం గురించి మాట్లాడాడు.
తన నాయకత్వం జట్టు మొత్తాన్ని ముందుకు తీసుకెళ్లడమే అని చెప్పాడు. ‘‘నా నాయకత్వ పాత్ర ఒకటే.. నేను మార్గదర్శిగా ఉండాలి. జట్టులో సంస్కృతిని ఏర్పాటు చేయాలి. జట్టు ఏ యాటిడ్యూడ్తో ఆడాలో ఆ మూడ్ క్రియేట్ చేయాలి’’ అని వివరించాడు.
అందరూ ఫాలో అయ్యే మార్గాన్ని ఏర్పాటు చేయాలని తాను అనుకుంటున్నట్లు తెలిపాడు. ‘‘జట్టు మొత్తాన్ని నాతో పాటు ముందుకు తీసుకెళ్లడమే నా నాయకత్వం’’ అని స్పష్టం చేశాడు. ఈసారి ఐపీఎల్లో అహ్మదాబాద్, లక్నో జట్లు కొత్తగా చేరిన సంగతి తెలిసిందే.
లక్నో జట్టు భారత స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్ను రూ.17 కోట్లకు కొనుగోలు చేసి రికార్డు సృష్టించింది. అతనే ఆ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు.