ముంబై: వ్యక్తిగత కారణంతో స్వదేశం వెళ్లిన వెస్టిండీస్ బ్యాటర్ షిమ్రాన్ హెట్మైర్ తిరిగి ఐపీఎల్లో ప్రత్యక్షమయ్యాడు. తన భార్య తొలి బిడ్డకు జన్మనివ్వడంతో హెట్మైర్ స్వదేశానికి వెళ్లాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జియెంట్స్తో జరిగిన మ్యాచ్లకు అతడు దూరంగా ఉన్నాడు.
ప్లేఆఫ్స్లో బెర్త్ను దాదాపు ఖాయం చేసుకోవడంతో తదుపరి మ్యాచ్ల కోసం హెట్మైర్ భారత్కు చేరుకున్నాడు. ‘హెట్మైర్ తిరిగి వచ్చాడు. ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నాడు’ అని ఐపీఎల్ వర్గాలు తెలిపాయి. 8 విజయాలతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. 25 ఏండ్ల హెట్మైర్ తాజా సీజన్లో 11 మ్యాచ్లాడి 291 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు.