క్రికెట్ పండుగ ఐపీఎల్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఈ టోర్నీ ఓపెనర్ మ్యాచ్లో తలపడాల్సిన చెన్నై సూపర్ కింగ్స్కు ఊహించని కష్టం వచ్చిపడింది. ఆ జట్టు స్టార్ ఆల్రౌండర్ మొయీన్ అలీ.. ఇంకా భారత్కు రాలేదు. చెన్నై జట్టు రిటైన్ చేసుకున్న ఆటగాళ్లలో అలీ ఒకడు. ఇప్పటికే ధోనీ సహా చెన్నై జట్టు ఆటగాళ్లలో చాలా మంది సూరత్ చేరుకున్నారు. అక్కడ టీం యాజమాన్యం ఏర్పాటు చేసిన ట్రైనింగ్ క్యాంపులో పాల్గొంటున్నారు.
ఇలాంటి సమయంలో అలీ మాత్రం యూకే నుంచి ట్రావెల్ క్లియరెన్స్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఫిబ్రవరి 20వ తేదీనే మొయీన్ అలీ భారత్ వచ్చేందుకు దరఖాస్తు చేసుకున్నాడని, ఇరవై రోజులు గడిచినా కూడా తనకు ఇంకా ట్రావెల్ పేపర్స్ అందలేదని చెన్నై జట్టు సీఈవో కాశీ విశ్వనాథన్ వెల్లడించారు.
‘‘మొయీన్ అలీ భారత్కు చాలా సార్లు వచ్చాడు. అయినా ఇంకా ట్రావెలన్ పేపర్లు అందకపోవడం శోచనీయం. అయితే త్వరలోనే అతను జట్టుతో కలుస్తాడని ఆశిస్తున్నాం. ట్రావెల్ పేపర్స్ అందిన వెంటనే దొరికిన విమానం ఎక్కేసి వచ్చేస్తానని అలీ చెప్పాడు’’ అని సీఎస్కే సీఈవో తెలియజేశారు. బీసీసీఐ కూడా తమకు సాయం చేసేందుకు ఈ విషయంలో జోక్యం చేుకుందని, సోమవారం నాటికి మొయీన్ అలీకి ట్రావెల్ పేపర్స్ అందుతాయని భావిస్తున్నట్లు ఆయన తెలిపారు.
కేవలం చెన్నైకే కాదు కొత్త జట్టు గుజరాత్ టైటన్స్కు కూడా ఇలాంటి ఇబ్బందే ఎదురైంది. ఆ జట్టు కోచింగ్ బృందంలో తాజాగా చేరిన అబ్దుల్ నయీమ్ కూడా యూకేలోనే ఉన్నాడు. ట్రావెల్ పేపర్స్ లభిస్తే భారత్కు వచ్చేందుకు ఎదురు చూస్తున్నాడు.