IPL-2021 | ఐపీఎల్-2021 సీజన్లో ఫైనల్స్కు వెళ్లే అవకాశాన్ని రాయల్ చాలెంజర్స్ ఆఫ్ బెంగళూరు (ఆర్సీబీ) కోల్పోయింది. సోమవారం షార్జా క్రికెట్ మైదానంలో జరిగిన తొలి ఎలిమినేటర్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) చేతిలో ఓటమి పాలైంది. చివరి ఓవర్లో రెండు బంతులు మిగిలి ఉండగానే కోల్కతా నైట్ రైడర్స్ నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. కోల్కతా నైట్ రైడర్స్ 19.4 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 139 పరుగుల విజయలక్ష్యాన్ని చేరుకున్నది.
కోల్కతా నైట్ రైడర్ ప్లేయర్ సునీల్ నారాయణ్.. నాలుగు వికెట్లు తీసి రాయల్ చాలెంజర్స్ ఆఫ్ బెంగళూర్(ఆర్సీబీ) వెన్ను విరిచాడు. లొకి ఫెర్గూసన్ రెండు వికెట్లు తీసుకున్నాడు. ఆర్సీబీ స్కిప్పర్ విరాట్ కోహ్లీ 33 బంతుల్లో 39 పరుగులు చేశాడు. ఐపీఎల్ లీగ్లో బెంగళూరు 18 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకున్నది. 14 పాయింట్లతో కోల్కతా ఫ్లేఆఫ్కు చేరుకున్నది. ఇక తొలి ఫ్లే ఆఫ్ మ్యాచ్లో ఓటమి పాలైన ఢిల్లీ క్యాపిటల్స్తో బుధవారం క్వాలిఫయర్-2 మ్యాచ్లో తలపడుతుంది. ఈ మ్యాచ్లో గెలుపొందిన జట్టు.. చెన్నై సూపర్ కింగ్స్తో ఫైనల్లో ఢీకొంటుంది.
బెంగళూరు నిర్దేశించిన 139 పరుగుల లక్ష్యాన్ని కోల్కతా చివరి ఓవర్లో రెండు బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది. కోల్కతా ఆటగాళ్లు శుభ్మన్ గిల్ 29, వెంకటేశ్ అయ్యర్ 26 పరుగులతో శుభారంభాన్నిచ్చారు. నితీశ్ రాణా 23, సునీల్ నారాయణ్ 26 పరుగులతో రాణించారు. అయితే, చివరి ఓవర్ ఉత్కంఠభరితంగా మారింది. ఆరు బంతుల్లో ఏడు పరుగులు చేయాల్సి ఉంది. తొలి బంతిని షకీబుల్ హసన్ ఫోర్ కొట్టాడు. తర్వాత మూడు సింగిల్స్తో విజయలక్ష్యాన్ని చేధించారు.