న్యూఢిల్లీ: భారత షట్లర్ సైనా నెహ్వాల్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్నకు దూరమైంది. గాయాల నుంచి సైనా ఇంకా కోలుకోకపోవడంతో ప్రపంచ టోర్నీకి వెళ్లడం లేదని ఆమె భర్త పారుపల్లి కశ్యప్ తెలిపాడు. ‘ప్రపంచ చాంపియన్షిప్ నుంచి సైనా విరమించుకుంది. మోకాలి గాయం నుంచి ప్రస్తుతం కోలుకుంటున్నది. సైనా ఇంకా ఫిట్గా లేదు. ఉబర్ కప్లో గాయపడిన సైనా ఫ్రెంచ్ ఓపెన్లో తీవ్రంగా గాయపడింది. మరికొన్ని రోజుల్లో సైనా కోలుకుని తిరిగి వస్తుందని ఆశిస్తున్నా’ అని కశ్యప్ తెలిపాడు. 2016 నుంచి ప్రపంచ టోర్నీలో ఆడుతున్న సైనా తొలిసారి దూరమైంది.