INDvsAUS T20I: భారత్-ఆస్ట్రేలియా మధ్య తిరువనంతపురం వేదికగా జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. భారత్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. సీనియర్ల గైర్హాజరీతో యువ జట్టుతో బరిలోకి దిగిన టీమిండియా.. వైజాగ్లో ముగిసిన తొలి మ్యాచ్లో అద్భుత విజయం సాధించిన విషయం తెలిసిందే. ఫస్ట్ టీ20 గెలవడంతో భారత్.. ఈ మ్యాచ్లో కూడా నెగ్గి సిరీస్లో 2-0తో ముందంజ వేయాలని చూస్తున్నది.
తుది జట్టులో భారత్ మార్పులేమీ చేయలేదు. తొలి మ్యాచ్లో బరిలోకి దిగిన జట్టుతోనే ఆడుతున్నది. మరోవైపు ఆసీస్ మాత్రం రెండు మార్పులు చేసింది. బెరెన్డార్ఫ్ స్థానంలో ఆడమ్ జంపా, ఆరోన్ హార్డీ స్థానంలో మ్యాక్స్వెల్ను తుది జట్టులోకి తీసుకుంది. వర్షం అంతరాయం కలిగించే అవకాశాలున్న ఈ మ్యాచ్లో రెండోసారి ఛేదన చేసే జట్టుకే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని గత రికార్డులు చెబుతున్న నేపథ్యంలో ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్న భారత్ ఏ మేరకు ఆడుతుందో చూడాలి.
తుది జట్లుః
భారత్ః రుతురాజ్ గైక్వాడ్, యశస్వీ జైస్వాల్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్, ప్రసిధ్ కృష్ణ
#TeamIndia remain unchanged for the 2nd T20I 👌👌
Follow the Match ▶️ https://t.co/nwYe5nOBfk#TeamIndia | #INDvAUS | @IDFCFIRSTBank pic.twitter.com/qf4x9QWiqR
— BCCI (@BCCI) November 26, 2023
ఆస్ట్రేలియాః స్టీవ్ స్మిత్, మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, గ్లెన్ మ్యాక్స్వెల్, మాథ్యూ వేడ్ (కెప్టెన్), సీన్ అబాట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా, తన్వీర్ సంఘా