కౌలాలాంపూర్: భారత స్టార్ షట్లర్లు మలేషియా ఓపెన్లో శుభారంభం చేశారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-500 టోర్నీ తొలి రౌండ్లో బుధవారం పీవీ సింధు, కిడాంబి శ్రీకాంత్, హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్ విజయాలు సాధించారు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో సింధు 21-13, 17-21, 21-18తో క్రిస్టోఫర్ (డెన్మార్క్)పై విజయం సాధించి ప్రిక్వార్టర్స్లో అడుగుపెట్టింది.
పురుషుల సింగిల్స్లో శ్రీకాంత్ 21-12, 21-16తో టోమా పొపోవ్పై, ప్రణయ్ 16-21, 21-14, 21-13తో ఆరోసీడ్ చౌ టైన్ చెన్పై విజయాలు సాధించారు. యువ షట్లర్ లక్ష్యసేన్ 21-10, 16-21, 21-9తో ఏడోసీడ్ లోహ్ కీన్ యేపై గెలుపొందాడు.