జకార్తా : ఇండోనేషియా ఓపెన్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి ప్రిక్వార్టర్ఫైనల్కు చేరుకుంది. బుధవారం జరిగిన పోరులో ఫ్రాన్స్కు చెందిన క్రిస్టో-టోమా జూనియర్ మధ్యలోనే తప్పుకోవడంతో భారత ద్వయం ముందంజ వేసింది. సాత్విక్-చిరాగ్ జంట 21-12, 11-7తో ఆధిక్యంలో ఉన్న దశలో క్రిస్టో మోకాలికి గాయమవడంతో ఫ్రెంచ్ జోడీ మ్యాచ్నుంచి తప్పుకున్నారు.
పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్, శ్రీకాంత్ రెండో రౌండ్కు చేరుకున్నారు. 20వ ర్యాంకర్ లక్ష్య సేన్ 21-17, 21-13 స్కోరుతో మలేసియాకు చెందిన జీ జియా లీను 32 నిమిషాలలో ఓడించగా, శ్రీకాంత్ చైనాకు చెందిన గాంగ్ జు లును చిత్తుచేశాడు.