బాకు(అజార్బైజాన్): ప్రతిష్ఠాత్మక ఫిడే ప్రపంచ చెస్ చాంపియన్షిప్లో భారత యువ గ్రాండ్ మాస్టర్ ఇరిగేసి అర్జున్..సెమీఫైనల్లోకి ప్రవేశించాడు. మంగళవారం జరిగిన క్వార్టర్స్లో అర్జున్ 53 ఎత్తుల్లో భారత్కే చెందిన ఆర్ ప్రజ్ఞానందపై అద్భుత విజయం సాధించాడు. ఆది నుంచే తనదైన దూకుడు కనబరిచిన అర్జున్..మెగాటోర్నీలో మరింత ముం వేశాడు.
మరో క్వార్టర్స్లో ప్రపంచ నంబర్వన్ ప్లేయర్ మాగ్నస్ కార్ల్సన్ చేతిలో గుకేశ్ ఓటమిపాలయ్యాడు. నల్లపావులతో బరిలోకి దిగిన కార్ల్సన్..గుకేశ్కు చెక్పెడుతూ సెమీస్లోకి వెళ్లాడు. విదిత్ గుజరాతి, నిజాత్ అబసోవ్తో క్వార్టర్స్ పోరులో తలపడనున్నాడు. మొత్తంగా మెగాటోర్నీలో నలుగురు భారత జీఎంలు క్వార్టర్స్లోకి ప్రవేశించిన సంగతి తెలిసిందే.