చెన్నై: భారత వెటరన్ ఓపెనర్ మురళీ విజయ్ అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు సామాజిక మాధ్యమాల వేదికగా సోమవారం ప్రకటించాడు. జాతీయ జట్టు తరఫున 61 టెస్టులు, 17 వన్డేలు, 9 టీ20లు ఆడిన విజయ్.. మూడు ఫార్మాట్లలో కలిపి 4490 పరుగులు చేశాడు.
ఆటకు వీడ్కోలు పలికినా.. క్రికెట్తో అనుబంధం కొనసాగిస్తానని 38 ఏండ్ల ఈ తమిళనాడు క్రికెటర్ వెల్లడించాడు. ఇన్నాళ్లు తనకు మద్దతిచ్చిన అభిమానులు, కుటుంబసభ్యులు, బీసీసీఐ, చెన్నై సూపర్ కింగ్స్ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. 2008లో నాగ్పూర్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో విజయ్ అరంగేట్రం చేశాడు.