టోక్యో : టోక్యో ఒలింపిక్స్ ( Tokyo Olympics ) లో భారత షూటర్ల ( Indian Shooters ) ప్రస్థానం ముగిసింది. ఇవాళ జరిగిన పురుషుల 50 మీటర్ల రైఫిల్ త్రీ పొజిషన్స్ ఈవెంట్లో షూటర్లు సంజీవ్ రాజ్పుత్ ( Sanjeev Rajput ), ఐశ్వరీ ప్రతాజ్ సింగ్ తోమర్ (Aishwary Pratap Singh Tomar ) లు విఫలం అయ్యారు. ఆ ఇద్దరూ ఆ ఈవెంట్ ఫైనల్లోకి ప్రవేశించలేకపోయారు. టోక్యో గేమ్స్ కోసం 15 మంది భారతీయ షూటర్లు వెళ్లారు. కానీ కేవలం సౌరభ్ చౌదరీ మాత్రమే .. 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్లో ఫైనల్కు అర్హత సాధించారు. కానీ ఏ ఒక్క షూటర్ కూడా పతకం సాధించలేకపోయారు. ఇవాళ 50మీ రైఫిల్ 3 పొజిషన్స్లో ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్.. క్వాలిఫయింగ్ రౌండ్లో 21వ స్థానంలో నిలిచాడు. సంజీవ్ రాజ్పుత్ 32వ స్థానంలో నిలిచాడు. అయితే ఈ ఈవెంట్లో టాప్ 8లో ఉన్నవారు మాత్రమే ఫైనల్కు వెళ్తారు.