న్యూఢిల్లీ: ఇటీవల ముగిసిన ఆసియా క్రీడల్లో పసడి పతకంతో మెరిసిన భారత స్టార్ డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి చరిత్ర సృష్టించింది. పురుషుల డబుల్స్లో ప్రపంచ నంబర్వన్ ర్యాంక్ కైవసం చేసుకుంది. బీడబ్ల్యూఎఫ్ మంగళవారం ప్రకటించిన ర్యాంకింగ్స్లో ఈ జంట అగ్రస్థానం చేజిక్కించుకుంది. మన దేశం నుంచి గతంలో ప్రకాశ్ పదుకోన్, సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ టాప్ ర్యాంక్లో నిలువగా..
ఇప్పుడు వారి సరసన సాత్విక్-చిరాగ్ చేరారు. బర్మింగ్హామ్ కామన్వెల్త్లో స్వర్ణం గెలువడంతో పాటు.. మన దేశం తరఫున తొలి సూపర్-1000 టైటిల్ నెగ్గిన సాత్విక్-చిరాక్ ద్వయం కొత్త అధ్యాయం లిఖించింది. పురుషుల సింగిల్స్లో హెచ్ఎస్ ప్రణయ్ 8వ ర్యాంక్ సొంతం చేసుకోగా.. మహిళల సింగిల్స్లో రెండు స్థానాలు మెరుగు పరుచుకున్న పీవీ సింధు 13వ ర్యాంక్లో నిలిచింది.
బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ ర్యాంకింగ్స్లో నంబర్వన్ స్థానానికి చేరిన నాలుగో భారతీయులుగా సాత్విక్-చిరాగ్ రికార్డుల్లోకెక్కారు.
గతంలో ప్రకాశ్ పదుకోన్, సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ ఈ ఘనత సాధించారు.