జిమెన్(చైనా): చైనా వేదికగా జరిగిన డైమండ్ లీగ్లో భారత యువ అథ్లెట్ అనినాశ్ సాబ్లె ఆకట్టుకున్నాడు. శనివారం జరిగిన పురుషుల 3000మీటర్ల స్టిపుల్చేజ్లో సాబ్లె ఐదో స్థానంలో నిలిచాడు. ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన రేసును అవినాశ్ 8నిమిషాల 16.27 సెకన్లలో ముగించాడు.
దీని ద్వారా ఈ నెల 16 నుంచి ఎగునె(అమెరికా) వేదికగా జరుగనున్న గ్రాండ్ ఫైనల్కు అవినాశ్ అర్హత సాధించాడు.