కాలి(కొలంబియా): అవకాశం ఇస్తే అంబరాన్ని చుంబిస్తామని మహిళల రుజువు చేస్తూనే ఉన్నారు. తాజాగా అండర్-20 ప్రపంచ అథ్లెటిక్స్లో ఉత్తరప్రదేశ్కు చెందిన రైతు బిడ్డ దాన్ని మళ్లీ రిపీట్ చేసింది. రైతు కుటుంబానికి చెందిన రూపాల్ చౌదరి ప్రపంచ జూనియర్ అథ్లెటిక్స్లో ఒకే ఏడాది రెండు పతకాలు సాధించిన తొలి భారత అథ్లెట్గా రికార్డులకెక్కింది. మంగళవారం 4×400 రిలేలో రజతం అందుకున్న రూపాల్ గురువారం మహిళల 400మీ. పరుగులో కాంస్యం గెలుచుకున్నది. రూపాల్ 51.85సె.లో గమ్యాన్ని చేరి మూడో స్థానంలో నిలిచింది. బ్రిటన్కు చెందిన యెమి మేరీ జాన్ 51.50సె.తో, కెన్యాకు చెందిన దామరిస్ ముతుంగ 51.57సె.తో తొలి రెండు స్థానాలు కైవసం చేసుకున్నారు. ఈ నేపథ్యంలో రూపాల్ మూడు రోజుల వ్యవధిలో నాలుగుసార్లు 400మీ. దూరాన్ని పరుగెత్తడం గమనార్హం.