న్యూఢిల్లీ: ఆసియా జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత్ పోరు ముగిసింది. సోమవారం జరిగిన క్వార్టర్ ఫైనల్ పోరులో భారత్ 1-3 తేడాతో ఇండోనేషియా చేతిలో ఓటమిపాలైంది. మిక్స్డ్ డబుల్స్ విభాగంలో భారత ద్వయం సమరవీర్, రాధిక 16-21, 15-21తో అడ్రియన్, ఫెలిషా అల్బెర్ట జోడీ చేతిలో ఓటమిపాలైంది. బాలుర సింగిల్స్లో ఆయూశ్ శెట్టి 21-18, 15-21, 19-21తో అల్వి ఫర్హాన్పై పోరాడి ఓడాడు. బాలికల సింగిల్స్లో రక్షిత శ్రీ 21-18, 10-21, 23-21తో రుజానపై గెలిచింది.