తెరెస్సా(స్పెయిన్): ప్రతిష్ఠాత్మక హాకీ ప్రపంచకప్ టోర్నీని భారత్ విజయంతో ముగించింది. క్వార్టర్స్కు అర్హత సాధించడంలో విఫలమైన టీమ్ఇండియా వర్గీకరణ మ్యాచ్లో సత్తాచాటింది. మంగళవారం కెనడాతో జరిగిన తమ ఆఖరి మ్యాచ్లో భారత్ 3-2(పెనాల్టీ షూటౌట్) తేడాతో విజయం సాధించింది. నిర్ణీత సమయంలో ఇరు జట్ల స్కోర్లు 1-1తో సమం కావడంతో విజేతను నిర్ణయించేందుకు పెనాల్టీ షూటౌట్ నిర్వహించారు. మ్యాచ్ తొలి క్వార్టర్ పదో నిమిషంలో మెడిలైన్ గోల్తో కెనడా 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. స్కోరు సమం చేసేందుకు మన అమ్మాయిలు కష్టపడాల్సి వచ్చింది. మ్యాచ్ మరో మూడు నిమిషాల్లో ముగుస్తుందనగా దక్కిన పెనాల్టీ కార్నర్ను సలీమా టెటె గోల్గా మలువడంతో స్కోరు 1-1తో సమమైంది. పెనాల్టీ షూటౌట్లో భారత్ తరఫున నేహా, సోనిక, నవనీత్కౌర్ గోల్స్ చేయగా, నటాలీ, అమండా.. కెనడాకు గోల్స్ అందించారు.