అమ్మాన్(జోర్డాన్): అండర్-20 ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత యువ రెజ్లర్ మోహిత్కుమార్ పసిడి పతకంతో కొత్త చరిత్ర లిఖించాడు. బుధవారం జరిగిన పురుషుల 61కిలోల ఫైనల్లో మోహిత్ 9-8 తేడాతో ఎల్దర్ అక్మదునియోవ్(రష్యా)పై అద్భుత విజయం సాధించాడు. మహిళల 76కిలోల ఫైనల్లో ప్రియ ఫైనలోకి ప్రవేశించింది.