జాగ్రెబ్ (క్రొయేషియా): భారత యువ రెజ్లర్ అమన్ షెరావత్.. జాగ్రెబ్ ఓపెన్ రెజ్లింగ్ చాంపియన్షిప్లో కాంస్య పతకం సాధించాడు. క్రొయేషియా వేదికగా జరిగిన ఈ టోర్నీ 57 కేజీల పురుషుల కాంస్య పతక పోరులో 17 ఏండ్ల అమన్.. 10-4తో జేన్ రాయ్ రిచార్డ్స్ (అమెరికా)పై విజయం సాధించాడు.
అలీ అబ్బాస్ (అజర్బైజాన్) స్వర్ణం కైవసం చేసుకున్నాడు. అంతకుముందు జరిగిన క్వార్టర్ ఫైనల్లో రాబెర్టీ డింగాష్వి (జార్జియా)పై అమన్ షెరావత్ విజయం సాధించాడు.