న్యూఢిల్లీ: భారత యువ టెన్నిస్ ప్లేయర్ గంటా సాయి కార్తీక్ రెడ్డి ఐటీఎఫ్ టోర్నీలో సత్తాచాటుతున్నాడు. ట్యూనీషియా వేదికగా జరుగతున్న టోర్నీలో సాయి కార్తీక్ సెమీఫైనల్కు దూసుకెళ్లాడు. పురుషుల డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో సాయి కార్తీక్-మనీశ్ కుమార్ జోడీ 6-4, 6-4తో కవారక్ కేన్-మొక్రాక్ (ఆస్ట్రేలియా) ద్వయంపై గెలిచి సెమీస్లో అడుగుపెట్టింది. అంతకుముందు ప్రిక్వార్టర్స్లో భారత జంట నాలుగో సీడ్ చైనా జోడీపై గెలుపొందడం విశేషం.