ఒర్లీన్స్: ఒర్లీన్స్ మాస్టర్స్ టోర్నీలో భారత యువ షట్లర్ తన్విశర్మ పోరాటం ముగిసింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో తన్వి 9-21, 16-21తో మాజీ ప్రపంచ చాంపియన్ నజోమి ఒకుహర(జపాన్) చేతిలో ఓటమిపాలైంది. 35 నిమిషాల్లోనే ముగిసిన పోరులో తన్వి..ఒకుహరకు దీటైన పోటీనివ్వలేకపోయింది. టోర్నీలో మెరుగైన ప్రదర్శన కనబరిచిన తన్వి.. ఒకుహరతో పోరులో అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకుంది.
గతేడాది సయ్యద్ మోదీ టోర్నీలో ఒకుహరకు షాకిచ్చిన తన్వి ఈసారి ఆ మ్యాజిక్ను పునరావృతం చేయలేకపోయింది. తన అనుభవాన్నంతా ఉపయోగిస్తూ ఒకుహర వరుస గేముల్లో మ్యాచ్ను తన వశం చేసుకుంది.