న్యూఢిల్లీ: భారత యువ షట్లర్ శంకర్ ముత్తుస్వామి జర్మనీ ఓపెన్ మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించాడు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-300 టోర్నీలో క్వాలిఫయింగ్ టోర్నీలో 20 ఏండ్ల శంకర్ సత్తాచాటాడు. తొలి మ్యాచ్లో శంకర్ 21-17, 21-10తో షెఫర్ (జర్మనీ)పై, రెండో రౌండ్లో 21-11, 21-18తో టాబిస్ కొంజీ (స్విట్జర్లాండ్)పై గెలిచి ప్రధాన టోర్నీలో అడుగుపెట్టాడు.