ఒర్లిన్స్: భారత యువ షట్లర్ ప్రియాన్షు రజావత్.. ఒర్లిన్స్ మాస్టర్స్ బ్యాడ్మింటన్ టోర్నీ సెమీఫైనల్కు దూసుకెళ్లాడు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-300 టోర్నీ పురుషుల సింగిల్స్ క్వార్టర్స్లో శుక్రవారం ప్రియాన్షు 21-18, 21-18తో చైనీస్ తైపీకి చెందిన చి యూ జెన్పై విజయం సాధించాడు. ప్రిక్వార్టర్స్లో టాప్సీడ్, ప్రపంచ 12వ ర్యాంకర్ కెంటా నిషిమోటో (జపాన్)ను మట్టికరిపించిన ప్రియాన్షు క్వార్టర్ ఫైనల్లో అదే జోరు కొనసాగించాడు. శనివారం జరుగనున్న సెమీస్లో నాట్ న్యూయెన్తో ప్రియాన్షు అమీతుమీ తేల్చుకోనున్నాడు. సైనా , సాయిప్రణీత్ తొలి రౌండ్లోనే నిష్క్రమించిన ఈ టోర్నీలో ప్రియాన్షు అదిరిపోయే ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు.