జ్యురిచ్: భారత యువ అథ్లెట్ నీరజ్ చోప్రాకు సముచిత గౌర వం దక్కింది. కెరీర్లో నీరజ్ సాధించిన అసమాన విజయాలకు గుర్తింపుగా స్విట్జర్లాండ్ పర్యాటక శాఖ ‘స్నేహపూర్వక రాయబారి’గా ఘనంగా సన్మానించింది. ‘భారత అథ్లెటిక్స్ దిగ్గజం నీరజ్ను సన్మానించడం గౌరవంగా భావిస్తున్నాం.
భవిష్యత్ తరాలకు అతను స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాడు. నీరజ్తో కలిసి కొనసాగడం చాలా సంతోషంగా ఉంది’ అని స్విస్ పర్యాటక శాఖ చీఫ్ పాస్కల్ ప్రింజ్ ఒక ప్రకటనలో పేర్కొన్నాడు.