ఓస్లో (నార్వే): ప్రపంచ రెజ్లింగ్ చాంపియన్షిప్లో భారత రెజ్లర్ రవీందర్ (61 కిలోలు) కాంస్య పతక పోరుకు అర్హత సాధించాడు. నార్వే రాజధాని ఓస్లోలో ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్స్లో రవీందర్ 0-8తో బల్గేరియాకు చెందిన జార్జి వాలెంటినోవ్ వాంగెలవ్పై విజయం సాధించాడు. కాంస్య పతక పోరులో అర్సెన్ హరుత్యున్యాన్ (అర్మేనియా)తో రవీందర్ తలపడనున్నాడు. ఈ టోర్నీ బరిలోకి దిగిన ఇతర భారత రెజ్లర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయారు.