న్యూఢిల్లీ: ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్లో భారత్కు స్వర్ణం దక్కింది. మహిళల 10 మీటర్ల రైఫిల్ విభాగంలో ఎలవెనిల్ వలరివాన్, రమిత, శ్రేయా అగర్వాల్తో కూడిన భారత త్రయం పసిడి పతకంతో మెరిసింది.
బాకు వేదికగా మంగళవారం జరిగిన ఫైనల్లో భారత బృందం 17-5తో డెన్మార్క్ జట్టుపై విజయం సాధించింది. అంతకుముందు జరిగిన అర్హత రౌండ్ స్టేజ్-1లో భారత్ 944.4 స్కోర్తో అగ్రస్థానంలో నిలిచింది. ఇదే విభాగంలో రుద్రాంక్ష్ పాటిల్, పార్త్ మఖిజా, ధనుశ్ శ్రీకాంత్ తో కూడిన భారత పురుషుల బృందం10-16తో క్రోయేషియా చేతిలో ఓడి తృటిలో పతకాన్ని చేజార్చుకుంది.