న్యూఢిల్లీ: స్టార్ స్ట్రయికర్ రాణి రాంపాల్ లేకుండానే భారత మహిళల హాకీ జట్టు ఎఫ్ఐహెచ్ ప్రపంచకప్లో బరిలోకి దిగనుంది. గాయం నుంచి పూర్తిగా కోలుకోకపోవడంతో హాకీ ఇండియా(హెచ్ఐ) ఆమె పేరు లేకుండా మంగళవారం 18 మందితో కూడిన జట్టును ప్రకటించింది. వచ్చే నెల 1 నుంచి 17 వరకు నెదర్లాండ్స్, స్పెయిన్లో జరుగనున్న మెగాటోర్నీలో బరిలోకి దిగనున్న అమ్మాయిల బృందానికి గోల్కీపర్ సవిత పునియా సారథ్యం వహించనున్నది. ‘రాణి గాయం నుంచి పూర్తిగా కోలుకోలేదు.
అందుకే ఆమె పేరు పరిగణనలోకి తీసుకోలేదు. తాజా ప్రదర్శన ఆధారంగా జట్టును ఎంపిక చేశాం. అనుభవజ్ఞులతో పాటు, యువ ఆటగాళ్లతో కూడిన జట్టు సమతూకంగా ఉంది’అని హెడ్కోచ్ షాప్మన్ పేర్కొన్నాడు. ప్రపంచకప్లో ఇంగ్లండ్, న్యూజిలాండ్, చైనాతో కలిసి పూల్-‘బి’లో ఉన్న భారత్.. జూలై 3న ఇంగ్లండ్తో తొలి మ్యాచ్ ఆడనుంది. గత ప్రపంచకప్ క్వార్టర్స్లో ఓటమి పాలైన భారత్.. ఈసారి పతకం నెగ్గాలని కృతనిశ్చయంతో ఉంది.