టోక్యో: ఒలింపిక్స్లో అసాధారణ పోరాటంతో తొలిసారి సెమీస్ వరకూ చేరిన భారత మహిళల టీమ్ ( Women’s Hockey ) ఫైనల్ చేరలేకపోయింది. బుధవారం జరిగిన సెమీఫైనల్లో అర్జెంటీనా చేతిలో 1-2 తేడాతో మన టీమ్ పోరాడి ఓడిపోయింది. దీంతో ఇక బ్రాంజ్ మెడల్ కోసం బ్రిటన్తో అమీతుమీ తేల్చుకోనుంది. సెమీస్లో రెండో నిమిషంలోనే గుర్జీత్ కౌర్ గోల్ చేసి ఇండియన్ టీమ్కు మంచి ప్రారంభం ఇచ్చినా.. ఆ తర్వాత మరో గోల్ సాధించలేకపోయారు. అర్జెంటీనా తరఫున కెప్టెన్ మారియా నోయెల్ 18, 36వ నిమిషంలో రెండు గోల్స్ చేసింది. తొలి క్వార్టర్లో 1-0 లీడ్లోకి దూసుకెళ్లిన టీమిండియా.. రెండు, మూడు క్వార్టర్లలో రెండు గోల్స్ ప్రత్యర్థికి ఇచ్చింది. ఇక నాలుగో క్వార్టర్లో రాణి రాంపాల్ టీమ్కు స్కోరు సమం చేసే అవకాశం రాలేదు.