దుబాయ్: అంతర్జాతీయ స్నేహపూర్వక మ్యాచ్లో భారత మహిళల ఫుట్బాల్ జట్టుకు నిరాశ ఎదురైంది. ఆసియా కప్ సన్నాహాల్లో భాగంగా యూఏఈలో సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్లో భారత్ 0-1 తేడాతో ట్యునీషియా చేతిలో ఓడింది. మ్యాచ్లో ఇరు జట్లు గోల్ కోసం హోరాహోరీగా తలపడ్డాయి. ఆట మొదలైన రెండో నిమిషానికే టీమ్ఇండియా గోల్ కొట్టే ప్రయత్నం చేసింది. అయితే ట్యునీషియా డిఫెండర్లు అడ్డుకోవడంతో సాధ్యపడలేదు. మరోవైపు భారత గోల్పోస్ట్ను లక్ష్యంగా చేసుకున్న ట్యునీషియాకు ఎనిమిదో నిమిషంలో వచ్చిన ఫ్రీకిక్ను హుజీ గోల్ కొట్టడంతో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత స్కోరును సమం చేసేందుకు భారత్ పలుమార్లు ప్రయత్నించినా..లాభం లేకపోయింది. తదుపరి పోరులో భాగంగా..భారత జట్టు బహ్రెయిన్కు బయల్దేరి వెళ్లనుంది.