మకాయ్: తొలి వన్డేలో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైన భారత మహిళల జట్టు.. రెండో మ్యాచ్లో నెగ్గి సిరీస్ సమం చేసేందుకు సిద్ధమైంది. కెప్టెన్ మిథాలీరాజ్ రాణించినా.. మిగిలినవాళ్లు పెద్దగా ప్రభావం చూపలేక పోవడంతో తొలి వన్డేలో 9 వికెట్ల తేడాతో ఓడిన భారత్.. శుక్రవారం జరుగనున్న రెండో వన్డేలో ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తున్నది. విదేశీ పిచ్లపై బౌలింగ్ విభాగం మరింత కృషిచేయాల్సిన అవసరం ఉండగా.. టాపార్డర్ ప్లేయర్లు భారీ ఇన్నింగ్స్లు ఆడితేనే భారత్కు అవకాశాలుంటాయి. ప్రాక్టీస్ సమయంలో గాయపడ్డ హర్మన్ప్రీత్ కౌర్ ఈ మ్యాచ్లోనూ బరిలో దిగడం కష్టమే కాగా.. షఫాలీ వర్మ, స్మృతి మందన, మిథాలీపై అదనపు భారం పడనుంది.