న్యూఢిల్లీ: మహిళల హాకీ ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీలో భారత జట్టు అజేయంగా దూసుకెళ్తున్నది. గత రెండు మ్యాచ్ల్లో జపాన్, మలేషియాపై అద్భుత విజయాలు సాధించిన భారత మహిళల జట్టు హ్యాట్రిక్ కొట్టింది. ఆదివారం మూడో పోరులో టీమ్ఇండియా 5-4తో థాయ్లాండ్ను చిత్తుచేసింది. భారత్ తరఫున కెప్టెన్ నవ్జ్యోత్ కౌర్ తొలి నిమిషంలోనే గోల్ చేయగా.. మోనిక (1వ నిమిషంలో, 7వ ని.లో) డబుల్ గోల్స్తో మెరిసింది. మహిమ చౌదరి (20వ ని.లో), అజ్మినా కుజుర్ (30వ ని.లో) చెరో గోల్ చేశారు.