సింగపూర్: సింగపూర్ స్విమ్మింగ్ చాంపియన్షిప్లో భారత స్విమ్మర్లు తొలి రోజే ఐదు పతకాలు కొల్లగొట్టారు. గురువారం జరిగిన పురుషుల 100మీటర్ల బ్యాక్స్ట్రోక్ విభాగంలో భారత స్టార్ స్విమ్మర్ శ్రీహరి నటరాజన్ 55.32 సెకన్ల టైమింగ్తో పసిడి పతకం కొల్లగొట్టాడు.
మహిళల 100మీటర్ల బ్యాక్స్ట్రోక్లో మనా పటేల్ 1:04: 47సెకన్ల టైమింగ్తో రెండో స్థానంతో రజత పతకం ఖాతాలో వేసుకుంది. 50మీటర్ల బటర్ఫ్లై విభాగంలో మిహిర్ అంబ్రె, 800 మీటర్ల ఫ్రీైస్టెల్లో అనీశ్ గౌడ పసిడి పతకాలు సొంతం చేసుకోగా, 100మీటర్ల బ్యాక్స్ట్రోక్లో శివ శ్రీధర్కు కాంస్య పతకం దక్కింది. మొత్తంగా మొదటి రోజు పోటీల్లో మూడు స్వర్ణాలు, ఒక రజతం, కాంస్యం లభించాయి.