పునరాగమనం అంటే ఎలా ఉండాలో.. పళ్లికల్ ప్రపంచానికి చాటిచెప్పింది. కవల పిల్లలకు జన్మనిచ్చి ఆరు నెలలు తిరగకముందే కోర్టులో అడుగుపెట్టిన చెన్నై చిన్నది.. స్కాష్ వరల్డ్ డబుల్స్ చాంపియన్షిప్లో రెండు టైటిల్స్ ఖాతాలో వేసుకుంది. మిక్స్డ్ డబుల్స్లో సౌరవ్తో కలిసి ట్రోఫీ పట్టిన దీపిక.. మహిళల డబుల్స్లో జోష్న చినప్ప తోడుగా టైటిల్ చేజిక్కించుకుంది.
గ్లాస్గో: భారత స్టార్ స్కాష్ ప్లేయర్ దీపిక పళ్లికల్.. వరల్డ్ డబుల్స్ చాంపియన్షిప్లో రెండు టైటిల్స్ ఖాతాలో వేసుకుంది. దాదాపు మూడున్నరేండ్ల తర్వాత బరిలోకి దిగిన తొలి మెగాటోర్నీలోనే దీపిక అదరగొట్టింది. శనివారం మిక్స్డ్ డబుల్స్ ఫైనల్లో దీపిక-సౌరవ్ జోడీ 11-6, 11-8తో అడ్రియన్ వాలెర్-అలీసన్ వాటెర్స్ (ఇంగ్లండ్) ద్వయంపై విజయం సాధించింది. టీమ్ఇండియా క్రికెటర్ దినేశ్ కార్తీక్ను పెళ్లాడిన దీపిక గతేడాది అక్టోబర్లో కవల పిల్లలకు జన్మనిచ్చింది. అంతకుముందు 2018 నుంచే స్కాష్కు దూరమైన దీపిక.. తాజా టోర్నీలో మునుపటి జోష్తో విజృంభించింది. మిక్స్డ్ టైటిల్ నెగ్గిన అనంతరం జరిగిన మహిళల డబుల్స్ ఫైనల్లో దీపిక-జోష్న చినప్ప జంట 11-9, 4-11, 11-8తో సారా పెర్రీ-అలీసన్ వాటెర్స్ (ఇంగ్లండ్) జోడీపై గెలిచి రెండో టైటిల్ ఖాతాలో వేసుకుంది. ఈ ప్రదర్శనతోనైనా తమ పేర్లు టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ (టాప్స్)లో చేర్చాలని ఈ ముగ్గురు అభిలాషిస్తున్నారు.