కౌలాలాంపూర్: భారత స్టార్ షట్లర్లు పీవీ సింధు, శ్రీకాంత్, ప్రణయ్ క్వార్టర్ ఫైనల్కు దూసుకెళ్లారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-500 టోర్నీ మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్స్లో గురువారం సింధు 21-16, 21-11తో అయా ఒహోరీ (జపాన్)పై విజయం సాధించింది.
40 నిమిషాల్లో ముగిసిన పోరులో సంపూర్ణ ఆధిక్యం కనబర్చిన తెలుగమ్మాయి.. వరుస గేమ్ల్లో విజృంభించింది. పురుషుల సింగిల్స్లో శ్రీకాంత్ 21-19, 21-19తో విదిత్సరణ్పై, ప్రణయ్ 13-21, 21-16, 21-11తో లి షీ ఫెంగ్పై గెలుపొందారు.