PV Sindhu | న్యూఢిల్లీ: నిరుడు బర్మింగ్హామ్ కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం నెగ్గిన అనంతరం స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతున్న భారత స్టార్ షట్లర్ పీవీ సింధు.. మరో టోర్నీకి సిద్ధమైంది. యూఎస్ ఓపెన్ క్వార్టర్స్లో ఓడిన ఈ తెలుగమ్మాయి.. మంగళవారం నుంచి ప్రారంభమయ్యే కొరియా ఓపెన్ బరిలోకి దిగనుంది. సింధు భావోద్వేగం.. యూఎస్ ఓపెన్ క్వార్టర్ ఫైనల్ ఓటమిపై సింధు భావోద్వేగానికి గురైంది.
గాయం కారణంగా ఐదు నెలల పాటు కోర్టుకు దూరమైన తెలుగమ్మాయి.. ఇటీవలే తిరిగి వేట ప్రారంభించింది. అయితే తాజా టోర్నీల్లో సింధు పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ‘ఈ ప్రదర్శన నాపై చాలా ప్రభావం చూపింది. పారిస్ ఒలింపిక్స్కు ముందు ఇలాంటి సవాళ్లు ఎదురవుతున్నాయి. అయినా రెట్టించిన ఉత్సాహంతో పోరాడేందుకు సిద్ధమవుతున్నా’ అని సింధు ట్విట్టర్లో పోస్ట్ పెట్టింది.