మాడ్రిడ్: భారత స్టార్ షట్లర్ పీవీ సింధు స్పెయిన్ మాస్టర్స్ టోర్నీ సెమీఫైనల్కు దూసుకెళ్లింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-300 మహిళల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో శుక్రవారం సింధు 21-14, 21-17తో మియా బ్లిచ్ఫెల్ట్ (డెన్మార్క్)పై విజయం సాధించింది. ఇటీవల బ్యాడ్మింటన్ ర్యాంకింగ్స్లో టాప్-10లో చోటు కోల్పోయిన సింధు.. క్వార్టర్స్లో స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చింది.
ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విజృంభించిన సింధు.. వరుస గేమ్ల్లో మ్యాచ్ను ముగించింది. ఈ ఏడాది ఓ టోర్నీలో సెమీస్కు చేరడం సింధుకు ఇదే తొలిసారి కాగా.. పురుషుల సింగిల్స్ కిడాంబి శ్రీకాంత్ ఓటమి పాలయ్యారు. క్వార్టర్స్లో శ్రీకాంత్ 18-21, 15-21తో కెంటా నిషిమోటో (జపాన్) చేతిలో ఓడాడు. ప్రస్తుతం ఈ టోర్నీలో భారత్ నుంచి సింధు మాత్రమే పోటీలో ఉంది.