సిడ్నీ: భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్ ఆస్ట్రేలియా ఓపెన్లో రన్నరప్గా నిలిచాడు. టోర్నీ ఆసాంతం రాణించిన ప్రణయ్ ఆదివారం జరిగిన తుదిపోరులో హోరాహోరీగా పోరాడి పరాజయం పాలయ్యాడు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-500 పురుషుల సింగిల్స్ తుదిపోరులో ప్రణయ్ 9-21, 23-21, 20-22తో వెంగ్ హాంగ్ యాంగ్ (చైనా) చేతిలో ఓడాడు. గంటన్నర పాటు సాగిన సుదీర్ఘ పోరులో తొలి గేమ్ కోల్పోయిన ప్రణయ్ ఆ తర్వాత బలంగా పుంజుకున్నాడు. ‘కేవలం స్కోరు బోర్డే నా గమనాన్ని నిర్దేశించలేదు. ఒక్కో మ్యాచ్కు ఒక కథ ఉంటుంది. ఇక మరో టోర్నీకి సిద్ధం కావాలి’ అని ప్రణయ్ ట్వీట్ చేశాడు.