కౌలాలాంపూర్: భారత స్టార్ షట్లర్ హెచ్ఎస్ ప్రణయ్.. మలేషియా బ్యాడ్మింటన్ టోర్నీ విజేతగా నిలిచాడు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-500 టోర్నీ పురుషుల సింగిల్స్ ఫైనల్లో ప్రణయ్ 21-19, 13-21, 21-18తో వెంగ్ హాంగ్ (చైనా)పై గెలుపొందాడు. ప్రణయ్కు ఆరేళ్ల తర్వాత ఇదే తొలి టైటిల్ కావడం గమనార్హం.
గంటన్నరకు పైగా హోరాహోరీగా సాగిన పోరులో ప్రతి పాయింట్ కోసం ఇరువురు ఆటగాళ్లు కొదమసింహాల్లా పోరాడారు. 2017లో యూఎస్ ఓపెన్ గ్రాండ్ ప్రి టైటిల్ నెగ్గిన తర్వాత ప్రణయ్ టీమ్ ఈవెంట్లలో సత్తాచాటినా సింగిల్స్లో విజేతగా నిలువలేకపోయాడు.