న్యూఢిల్లీ: భారత స్టార్ ఫెన్సర్ భవానీ దేవి కొత్త చరిత్ర లిఖించింది. ఏషియన్ ఫెన్సింగ్ చాంపియన్షిప్లో భవాని కాంస్య పతకంతో మెరిసింది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో భారత్ తరఫున పతకం సాధించిన తొలి ఫెన్సర్గా అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. సోమవారం జరిగిన మహిళల సాబ్రె విభాగపు పోరులో వుక్సి(చైనా) చేతిలో ఓడిన భవాని కాంస్యాన్ని ఖాతాలో వేసుకుంది.
అంతకుముందు జరిగిన సెమీస్లో భవాని 14-15 తేడాతో జైనబ్ దైబెకోవా(ఉజ్బెకిస్థాన్)పై పోరాడి ఓడింది. ఏషియన్ ఫెన్సింగ్ టోర్నీలో కాంస్య పతకం సాధించిన దేవిని జాతీయ ఫెన్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజీవ్ మెహతా అభినందించారు. భారత ఫెన్సింగ్కు ఇది గర్వకారణమైన రోజు అని పేర్కొన్నారు.