Odish Masters 2023 : స్వదేశంలో జరుగుతున్న ఒడిశా మాస్టర్స్ టోర్నమెంట్(Odish Masters 2023)లో భారత స్టార్ డబుల్స్ జోడీ అశ్వినీ పొన్నప్ప(Ashwini Ponnappa), తనీశ క్రాస్టో(Tanisha Crasto) అదరగొడుతోంది. తొలి రౌండ్ నుంచి దూకుడుగా ఆడుతున్న ఈ ద్వయం సెమీ ఫైనల్కు దూసుకెళ్లింది.
శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో చైనీస్ తైపీకి చెందిన సుంగ్ షుయో యున్, యూ చియెన్ హుయూ జంటను అశ్విని, తనీషా చిత్తు చేశారు. హోరాహోరీగా జరిగిన పోరులో 22-20, 20-22, 21-14తో గెలుపొందారు. మరో మ్యాచ్లో రుతుపర్ణ పండా, శ్వేతపర్ణ పండా ఓటమి పాలయ్యారు. ఇండోనేషియాకు చెందిన జెసితా పుత్రి, మియాంతొరొ ఫెబి సెటియానింగ్రమ్ ద్వయం చేతిలో 9-21, 15-21తో పరాజయం పాలైంది.
మిక్స్డ్ డబుల్స్లో అశ్వినీ క్రాస్టో, ధ్రువ్ కపిల ఇండోనేషియా జోడీపై గెలుపొందింది. వరుస సెట్లలో ఆధిపత్యం చెలాయించిన భారత ద్వయం మర్వాన్ ఫర్జా, జెస్సికా మయా రిస్మవర్దానీపై 21-16, 21-11తో విజయం సాధించింది.