బర్మింగ్హామ్ : రెండు దశాబ్దాలకు పైగా ఊరిస్తున్న ఆల్ ఇంగ్లండ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్ టైటిల్ వేటకు భారత షట్లర్లు సిద్ధమయ్యారు. పుల్లెల గోపీచంద్ తరువాత ఈ టైటిల్ దక్కించుకునేందుకు భారత ఆటగాళ్లు పోరాడుతూనే ఉన్నారు. 1980లో ప్రకాష్ పదుకోన్, 2001లో గోపీచంద్ తరువాత ఈ టైటిల్ అందని ద్రాక్షగానే మిగిలింది.
గత యేడాది లక్ష్యసేన్ ఫైనల్కు చేరుకున్నా టైటిల్ గెలువడంలో విఫలమయ్యాడు. రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధుకు సైతం ఈ టైటిల్ కొరకరాని కొయ్యలానే ఉంది. మహిళల్లో 2015లో సైనా నెహ్వాల్ ఫైనల్కు చేరడమే చెప్పుకోదగ్గ ఘనత. ఈసారి భారత షట్లర్లకు కఠినమైన డ్రానే ఎదురుకానున్నది.