Tharun Mannepalli | అస్తానా: కజకిస్థాన్ ఇంటర్నేషనల్ చాలెంజ్ బ్యాడ్మింటన్ టోర్నీలో హైదరాబాద్ యువ షట్లర్ తరుణ్ మన్నెపల్లి విజేతగా నిలిచాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో తరుణ్ 21-10, 21-19తో ఎనిమిదో సీడ్ సూంగ్ జూ వెన్(మలేషియా)పై అలవోక విజయం సాధించాడు. ఈ క్రమంలో తన కెరీర్లో తొలి అంతర్జాతీయ టైటిల్ను ఖాతాలో వేసుకున్నాడు.
మరోవైపు మహిళల సింగిల్స్ తుది పోరులో అనుపమ ఉపాధ్యాయ 21-15, 21-16తో భారత్కే చెందిన ఇషారాణి బరుహపై విజయం సాధించింది. మిక్స్డ్ డబుల్స్లో సంజయ్ శ్రీవాస్తవ, మనీష జోడీ 21-9, 7-21, 12-21తో వాంగ్టైన్ సిలిమ్, లిమ్ చీవ్ సియెన్ ద్వయం చేతిలో ఓడి రన్నరప్ టైటిల్తో సరిపెట్టుకుంది.